వేధాల ఆధారంగా కృష్ణ బియ్యాన్ని పండించి ఔరా అనిపిస్తున్నాడు కరీంనగర్ యువరైతు కౌటిల్య కృష్ణన్. ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న కృష్ణ బియ్యాన్ని(నల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాశింపేట గ్రామంలో విజయవంతంగా పండిస్తున్నాడు. గతేడాది నల్లబియ్యాన్ని పండించి ప్రశంసలందుకున్న కౌటిల్య మరోసారి కృష్ణ వ్రీహి బియ్యాన్ని పండించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ యజుర్వేదం చదువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తున్నాడు. కృష్ణ వ్రీహి అని పిలిచే ఈ కృష్ణ బియ్యానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించింది.
తెలంగాణ ప్రాంతంలో రైతులు అనాదిగా అనుసరించే మడి కట్టే పద్ధతితో పాటు వేద వ్యవసాయ పద్ధతులు ఫాలో అయినట్లు ఆయన చెప్పారు.