ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తాలకు కాల్పనిక అంశాల్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ‘రెండు పాటలు మినహా టాకీపార్ట్ పూర్తయింది. హైదరాబాద్లో వేసిన భారీ సెట్స్లో కీలక ఘట్టాల్ని దృశ్యమానం చేశాం. కథానాయకులిద్దరు తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన డబ్బింగ్ను పూర్తిచేశారు. త్వరలోనే మిగతా భాషల అనువాద కార్యక్రమాల్ని పూర్తిచేస్తాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేక్షకుల్ని నాటి చారిత్రక కాలానికి తీసుకెళ్లి కొత్త అనుభూతినందించే సినిమా ఇది’ అని చిత్రబృందం తెలిపింది. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అలియాభట్, ఒలివియా మోరిస్, అజయ్దేవ్గణ్, రేస్టీవెన్సన్, అలిసన్ డూడి తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు.