వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అన పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది. ఎప్పుడో ఈ రిలీజ్ కావలసిన ఈ చిత్రానికి కరోనా బ్రేక్ వేసింది. అయితే ఇప్పుడు కరోనా కాస్త శాంతించడంతో మేకర్స్ షూటింగ్ని తిరిగి మొదలు పెట్టారు. జూలై నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్లో మూవీని విడుదల చేయాలనుకుంటున్నారట.
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ ఇటీవల పునఃప్రారంభమైంది. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో కీలక ఘట్టాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల క్రితమే రామ్చరణ్ సెట్స్లో అడుగుపెట్టగా బుధవారం నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో భాగమయ్యారు. తాజా షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్చరణ్లపై కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల ప్రథమార్థంలో అలియాభట్, రామ్చరణ్లపై పాటను తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రణాళికల్ని సిద్ధంచేస్తున్నట్లు తెలిసింది.