సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఆమె ఫస్ట్లుక్ను విడుదల చేయగా.. ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఫస్ట్లుక్ పోస్టర్లో ‘తప్పూ ఒప్పులు లేవు.. అధికారం మాత్రమే శాశ్వతం’ అని ఉన్న ల్యాగ్లైన్ ఆమె పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.
ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో కంటే భిన్నమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నాడని టాలీవుడ్లో టాక్. సినిమాలో సాయితేజ్తో ఐశ్యర్య రాజేశ్ జోడీకట్టనుంది. నటుడు జగపతి బాబు సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనకు సంబంధించిన లుక్ సైతం త్వరలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. చిత్రాన్ని జేబీ ఎంటర్టైన్మెంట్, జీ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.