పట్నా: కరోనా మహమ్మారి దేశమంతటా కల్లోలం సృష్టిస్తున్న బీహార్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కలకలం రేపుతున్నది. దాంతో రాష్ట్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను సాకుగా చూపి కొవిడ్ బాధితులను అడ్మిట్ చేసుకోకుండా వెనక్కి పంపుతున్నాయి. బీహార్లోని మూడు ప్రధాన కొవిడ్ కేంద్రాల్లో ఒకటైన నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దాంతో ఆస్పత్రి డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఆస్పత్రిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా అందుకు తాను బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
మరోవైపు బీహార్లో 20 రోజుల క్రితం 500గా ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు 40 వేలకు పెరిగిపోయాయి. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతండటంతో ఆస్పత్రులకు కరోనా బాధితుల తాకిడి కూడా పెరుగుతున్నది. దాంతో ఆస్పత్రుల్లో ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లు నిండిపోతున్నాయి. పట్నా ఎయిమ్స్, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లాంటి ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లు నిండిపోయాయి. ఆక్రమించబడ్డాయి.
రాష్ట్రంలో మొత్తం 30 ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తుండగా, అన్ని ఆస్పత్రుల్లో కలిపి అందుబాటులో ఉన్న ఐసీయూ బెడ్లు మాత్రం 3,500 కంటే తక్కువే ఉన్నాయి. గత నాలుగు రోజులుగా బీహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత గురించి తక్కువచేసి చెబుతుండగా, ఎన్ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ కుమార్ సింగ్ ఏప్రిల్ 17న బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది.
తాను 2020, జూలై 21 నుంచి ఎన్సీఎంహెచ్లో మెడికల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నానని, కాని గత కొన్ని రోజులుగా ఇక్కడ ఆక్సిజన్ కొరత ఏర్పడిందని వినోద్కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఇతర ఆస్పత్రులకు కూడా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా జరుగుతున్నదని, దాంతో ఇక్కడ ఆక్సిజన్కు కొరత ఏర్పడుతున్నదని, దీనివల్ల ఆస్పత్రిలో డజన్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆ లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు మృతిచెందినా అందుకు తానే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని, అందువల్ల తాను బాధ్యతల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు.
అయితే, ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటామని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో డాక్టర్ వినోద్కుమార్ సింగ్ ఎన్ఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్గా కొనసాగుతున్నారు. కాగా, ఆస్పత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం స్పష్టమైన సూచనలు చేసినప్పటికీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను సాకుగా చూపుతూ చికిత్సను నిరాకరిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఈ పానీయాలు తీసుకోవాలి..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ