బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సోమవారంతో సుశాంత్ కన్నుమూసి ఏడాదైంది. ఈ క్రమంలో ఆయనను అభిమానులు,సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. ఇక సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి.. సుశాంత్ను తలచుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది.
నువ్వు లేవనే నిజాన్ని నమ్మడం కష్టంగా ఉంది. సమయం అన్నింటిని నయం చేస్తుందని విన్నాను, కాని నువ్వే నా సమయం. నా సర్వస్వం నువ్వే. నిన్ను తలచుకోని క్షణం లేదు. నువ్వు ఎక్కడున్నా కూడా నన్ను చూస్తూ నాకు అండగా ఉంటావు. నన్ను కూడా నీతో పాటే తీసుకెళ్తావని ప్రతి రోజు ఎదురు చూస్తున్నాను. నీ కోసం ప్రతి చోట వెతుకుతున్నాను. నువ్వు సాధించావు బేబూ అని మనసులో అనుకొని మరుసటి రోజు కోసం ఎదురుచూస్తుంటాను. నువ్వు నా పక్కన లేవనే బాధ భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తుంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు. ఈ శూన్యాన్ని ఎవరు పూడ్చలేరు. నా స్వీట్ బాయ్ కోసం ఇంకా ఎదురుచూస్తునే ఉంటాను. నేను మీకు ప్రతిరోజూ ‘మాల్పువా’ ఇస్తాను. దయచేసి నా వద్దకు తిరిగి వచ్చేయ్. అంటూ భావోద్వేగానికి లోనయింది రియా. మరో వైపు సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా కూడా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.