నిజాంసాగర్/ఎల్లారెడ్డిరూరల్/ పిట్లం/ బిచ్కుంద/ మద్నూర్/ నాగిరెడ్డిపేట్/ రామారెడ్డి/లింగంపేట/ సదాశివనగర్, ఏప్రిల్ 19 : ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలపరిధిలోని లింగారెడ్డిపేట్ సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, జడ్పీటీసీ ఊషాగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, నాయకులు రాము, మర్రి ప్రకాశ్, సొసైటీ సీఈవో విశ్వనాథం, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలపరిధిలోని తిమ్మారెడ్డి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అబ్దుల్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో వెల్లుట్ల సొసైటీ చైర్మన్ సాయిలు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు గోలి వసంతం, ఏఈవో రాజాగౌడ్ పాల్గొన్నారు. మత్తమాల పీఏసీఎస్ పరిధిలోని మత్తమాల, రుద్రారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ ఊషాగౌడ్, వైస్ఎంపీపీ పెద్దెడ్ల నర్సింహులు, ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గాటాడి సంతోష్కుమార్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలం హసన్పల్లి, గున్కుల్, బుర్గుల్, కోమలంచ గ్రామాల్లో గున్కుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు ప్రారంభించారు.
మండలంలోని నర్సింగ్రావుపల్లి, వెల్గనూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విఠల్, సొసైటీ చైర్మన్ వాజిద్అలీ, వైస్ ఎంపీపీ మనోహర్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేశ్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.పిట్లం మండలం కారేగాంలో సహకారసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ వెంకట్రెడ్డి, హస్నాపూర్లో పిట్లం సహకార సంఘం చైర్మన్ శపథంరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సహకారసంఘ సభ్యులు, డైరెక్టర్లు, కార్యదర్శులు నర్సింహారెడ్డి, సంతోష్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
బిచ్కుంద మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ బాలాజీ ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు యాదవ్రావు, డైరెక్టర్లు శివరాజు, సంజీవ్, సొసైటీ సీఈవో శ్రావణ్, రైతులు పాల్గొన్నారు.మద్నూర్ మండలంలోని మదన్హిప్పర్గలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ రామ్పటేల్, ఎంపీపీ లక్ష్మీబాయి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సర్పంచ్ రాజు పటేల్, ఎంపీటీసీ సుభాష్, డైరెక్టర్ అశోక్ పాల్గొన్నారు.నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్-కిచ్చన్నపేట్ సొసైటీ పరిధిలోని జాన్కంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయిలు, సొసైటీ వైస్ చైర్మన్ బాబు, ఏవో విజయశేఖర్, సీఈవో జైపాల్రెడ్డి, సంజీవులు పాల్గొన్నారు.
రామారెడ్డి మండల కేంద్రంతోపాటు కన్నాపూర్ తండాలో అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవీందర్ రావు, రామారెడ్డి సర్పంచ్ సంజీవ్, డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మాగౌడ్, కన్నాపూర్ తండా సర్పంచ్ చందర్, ఉపసర్పంచ్ శర్మన్, సీఈవో కడెం భైరయ్య, నవీన్ పాల్గొన్నారు.లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి సహకార సంఘం పరిధిలోని మాలపాటి, శెట్పల్లిసంగారెడ్డి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ శాఖ అధికారి సాయిరమేశ్గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈవో అవుసుల శ్రీనివాస్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలకేంద్రంలో విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార అధికారిణి వసంత ప్రారంభించారు. విండో చైర్మన్ కమలాకర్ రావు, ఎంపీపీ గైని అనసూయ, జడ్పీటీసీ నర్సింహులు, వైస్ చైర్మన్ సామాల సంగవ్వ, సహకార అధికారి నగేశ్, విండో సీఈవో విఘ్నేశ్గౌడ్, డైరెక్టర్లు మధుసూదన్రావు, ఏనుగు జనార్దన్రెడ్డి, బాల్రెడ్డి, ఏఈవో కవిత పాల్గొన్నారు. సదాశివనగర్ మండలం దగ్గి, కల్వరాల్ గ్రామాల్లో ధాన్యం కేంద్రాలను ధరణి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం అధ్యక్షుడు బాణాల మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో దగ్గి, కల్వరాల్ సర్పంచులు సుందరమ్మ, మమత, కల్వరాల్ ఎంపీటీసీ జయశ్రీ రమేశ్ రావు, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, మాజీ సర్పంచ్ గంగాధర్ రావు, తిమ్మోజివాడి, దగ్గి ఉప సర్పంచులు రాజయ్య, పద్మ, ధరణి సంఘం ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, కార్యదర్శి కళావతి, సహాయ కార్యదర్శి రాజేశ్వర్ రావు, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఈవో స్నేహలతాగౌడ్ పాల్గొన్నారు.