ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్ టీకా వేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. అనేక రాష్ర్టాలు తమ ప్రజలకు ఉచితంగా టీకాలు వేస్తున్నాయని తెలిపారు. కేంద్రం ముందుకొచ్చి దేశ ప్రజలకు ఉచితంగా టీకా వేయాలని, అదే అసలైన జాతీయవాదం అనిపించుకొంటుందని ఆమె ఆదివారం మోదీకి ట్వీట్ చేశారు.