వరంగల్: ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల్లడించారు. వరంగల్లో పర్యటించిన సీఎం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి ఏంచేస్తే బాగుంటుందని ఆలోచించి బడ్జెట్లో కార్పొరేషన్కు ప్రత్యేకంగా రూ.250 కోట్లు కేటాయించారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి గరీబ్నగర్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో
చెరువు శిఖంలో పట్టాలు ఎక్కడా ఇవ్వలేదని, గరీబ్ నగర్లో మాత్రమే ఇచ్చారని, త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్కు పేదల కష్టాలు తెలుసునని, అందుకే వారికి ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి చనిపోయిన తర్వాతే కొత్తవారికి పెన్షన్ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదని, అర్హులందరికీ రూ.2 వేలు ఇస్తున్నారని తెలిపారు. త్వరలో లబ్ధిదారుల వయస్సును 57 ఏండ్లకు తగ్గిస్తామన్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు.
ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణిలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్నామన్నారు. ఇలాంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
అందువల్ల పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..