ముంబై, జూన్ 10: కరోనామహమ్మారీ నేపథ్యంలో అన్నీ బ్యాంకులు డిజిటల్ ట్రాన్జాక్షన్స్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ సమయంలో చాలా డిజిటల్ పే మెంట్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటిని వినియోగించే కష్టమర్ల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతున్నది. మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘ఐ మొబైల్ పే ‘ను ఇతర బ్యాంకులకు చెందిన 20 లక్షల ఖాతాదారులు వినియోగిస్తున్నారని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. ఈ యాప్ను అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చిన కేవలం ఐదు నెలల్లోనే ఇతర బ్యాంకులకు చెందిన పెద్ద ఎత్తున కస్టమర్లు వినియోగించుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా చాలామంది కస్టమర్లు దీనిని వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఇందులోని వివిధ ఫ్యూచర్స్ కస్టమర్లకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నది. ఇతరులకు డబ్బులు పంపించడం, బిల్ పేమెంట్స్, స్కాన్ అండ్ పే తదితర ఆప్షన్స్ ఉన్నాయి.
వివిధ ఫ్యూచర్స్ నేపథ్యంలో ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఐ మొబైల్ పేను వినియోగిస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఇతర బ్యాంకుల కస్టమర్లతో సహా అందరికీ ఐ మొబైల్ పే పని చేస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు తన మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్ఫాం ‘ ఐ మొబైల్ పే’ ను 2020 డిసెంబర్లో అన్ని బ్యాంకుల కస్టమర్ల కోసం ప్రారంభించింది. అలాగే బ్యాంకు పరిశ్రమకు ఇంటర్పెరాబిలిటీ అందించింది.
ఇదిఏదైనాబ్యాంకుకస్టమర్లకువారిఖాతానుయాప్తోఅనుసంధానించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. తద్వారా చెల్లింపులు,లావాదేవీలను డిజిటల్గా చేసుకోవచ్చు. కరోనా సమయంలో కస్టమర్లు వారి ఇంటి నుంచి పొదుపు ఖాతాలు, గృహ రుణాలు, క్రెడిట్కార్డులు, వ్యక్తిగత రుణాలు వంటి పూర్తి స్థాయి ఐసీఐసీఐ బ్యాంకు సేవలను పొండుతున్నారు.