‘జీవితకు, నాకు మధ్య వచ్చిన విభేదాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమవ్వలేదు. దేవుడి మీద ఒట్టేసి ఆ మాట చెబుతున్నా. అందుకు కొన్ని చెప్పకూడని కారణాలున్నాయి’ అని అన్నారు రామ్గోపాల్వర్మ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. రాజశేఖర్, స్వాతిదీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బొగ్గారం వెంకటశ్రీనివాస్ నిర్మాతలు. ఈ నెల 16న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో రామ్గోపాల్వర్మ మాట్లాడుతూ ‘హారర్ పాయింట్కు విభిన్నమైన ఎలిమెంట్స్ జోడించి సినిమా చేశాం. అనుకున్న స్థాయిలో సినిమా రాకపోవడంతో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందనిపించింది. ఆ సమయంలో రాజశేఖర్ మరో సినిమా చేస్తుండటంతో ఆయన లుక్ ఛేంజ్ అయ్యింది. ఆ తర్వాత నేను బిజీగా మారిపోయా. ఆ కారణాల వల్ల సినిమా విడుదలలో జాప్యం చోటుచేసుకున్నది’ అని పేర్కొన్నారు. స్వాతి దీక్షిత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విడుదల కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. ఆర్జీవీ దెయ్యం ప్రతి ఒక్కరిని భయపెడుతుంది’ అని చెప్పింది. జీవితరాజశేఖర్ మాట్లాడుతూ ‘గతం గురించి మాట్లాడటం దండగ అనుకుంటున్నా. అవాంతరాలన్నింటికి దాటుకొని సినిమా విడుదలకాబోతుండటం ఆనందంగా ఉంది’ అని తెలిపింది. మంచి కంటెంట్ ఉన్న చిత్రమిదని నట్టి కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం పేర్కొన్నారు.