వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేష్బాబు, కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియమణి కీలకపాత్రధారి. సెన్సార్ పూర్తయింది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రమిది. నారప్ప ఎవరు? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం శత్రువులతో అతడు ఎలాంటి పోరాటం చేశాడు? అతడి ప్రతీకారం ఎవరిపై అనేది ఆసక్తికరంగా ఉంటుంది. వెంకటేష్ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని ప్రశంసించడం ఆనందంగా ఉంది. సుందరమ్మగా ప్రియమణి పాత్ర చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది’ అని తెలిపారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలకాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వాటిపై త్వరలో చిత్రబృందం క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కార్తిక్త్న్రం, రావురమేష్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు.