కమల్హాసన్-శంకర్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ 2 సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే మొదటి నుంచి బడ్జెట్ అంశం, క్రేన్ కుప్పకూలడం, ఆ తర్వాత కోవిడ్ ఎఫెక్ట్..ఇలా ప్రతీది చుట్టుముట్టే సరికి ఇండియన్ 2 ప్రాజెక్టు అటకెక్కింది. నిర్మాతలతో వచ్చిన విబేధాల కారణంగా శంకర్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. అయితే లైకా ప్రొడక్షన్స్ శంకర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది.
ఇండియన్ 2 ను పూర్తి చేయకుండా శంకర్ మరే సినిమా తీసుకునేందుకు అనుమతి ఇవ్వొద్దని మేజిస్ట్రేట్ ను నిర్మాతలు కోరారు. తాజా సమాచారం ప్రకారం హైకోర్టు ఈ వివాదానికి పరిష్కారం చూపించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆర్ పనుమతిని మధ్యవర్తిగా నియమించింది. పనుమతి స్టేట్ మెంట్ ను అధ్యయనం చేసిన తర్వాత తుది తీర్పు వెలువరించనుంది.
వివాదానికి ఫుల్స్టాప్ పడి త్వరలో సినిమా మొదలవుతుందని ఆశిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఫీమేల్ లీడ్స్ చేస్తుండగా.. సిద్దార్థ్ కీ రోల్ పోషిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com