చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ జానీ బెయిర్స్టో(55) ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును బెయిర్ష్టో అర్ధశతకం సాధించి ఆదుకున్నాడు. మనీశ్ పాండేతో కలిసి బెయిర్స్టో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. రస్సెల్ వేసిన 8వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ బాది 15 రన్స్ బాదిన బెయిర్స్టో అప్పటి నుంచి వీలుచిక్కినప్పుడల్లా బౌలర్లపై విజృంభించాడు. పాట్ కమిన్స్ వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతికి జానీ ఔటయ్యాడు. బెయిర్స్టో బాదిన బంతి నేరుగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న నితీశ్ రాణా చేతిలో పడింది. మనీశ్(44), మహ్మద్ నబీ(2) క్రీజులో ఉన్నారు. సన్రైజర్స్ విజయానికి ఇంకా 36 బంతుల్లో 75 పరుగులు చేయాల్సి ఉంది.