బొంరాస్పేట, ఏప్రిల్ 12 : బొంరాస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 120 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ రవీందర్, ఇతర సిబ్బంది, ఏఎస్ఐ సత్యశీలారెడ్డి, ఐకేపీ ఏపీఎం అంజిలయ్య, సీసీలు టీకా తీసుకున్నారు. అర్హులందరూ టీకా తీసుకోవాలని వైద్యాధికారి రవీంద్రయాదవ్ కోరారు. టీకా తీసుకున్నా జాగ్రతలు, కొవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. సోమవారం 111 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా రేగడిమైలారం గ్రామానికి చెందిన 4, హంసాన్పల్లిలో, ఏర్పుమళ్ల, బొంరాస్పేట గ్రామాల్లో ఒక్కక్కరికి చొప్పున పాజిటివ్ నిర్ధారణ అయిందని రవీంద్ర యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్వో శివరాజ్, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి, ఫార్మాసిస్టు సరోజినీబాయి, కంప్యూటర్ ఆపరేటర్ రమేశ్ పాల్గొన్నారు.
వ్యాక్సిన్ తీసుకోవాలి
ధారూరు, ఏప్రిల్ 12 : మండల పరిధిలోని 45 సంవత్సరాలు పైబడినవారు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాజు తెలిపారు. సోమవారం ధారూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకునేవారు కేంద్రానికి వచ్చేటప్పుడు తమ ఆధార్ కార్డును వెంట తీసుకురావాలన్నారు.
దౌల్తాబాద్లో..
దౌల్తాబాద్, ఏప్రిల్ 12 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది 147 మందికి సోమవారం టెస్టులు నిర్వహించగా 17 మందికి పాజిటివ్గా నమోదైనట్లు డాక్టర్ రతలాల్ వెల్లడించారు. సోమవారం 70 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు.