ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ టౌన్, జూన్ 15 : అందరి సహకారంతో మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని అప్పయ్య ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, హరితహారం, పట్టణ ప్రగతి తదితర పథకాల అమలుతో కోదాడను గ్రీన్సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కోదాడ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఉన్నతంగా అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. అభివృద్ధి, పరిశుభ్రతలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ శిరీష మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సహకారంతో పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన టీఆర్ఎస్ నాయకుడు భూపతిరాజుకు సంతాపం తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబు, మేనేజర్ అంకుశావలీ, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.