టాలీవుడ్ భామలు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కాంబినేషన్ లో ఫీమేల్ సెంట్రిక్ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాకిని-ఢాకిని టైటిల్ను ఫిక్స్ చేశారు. కొరియన్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మిడ్నైట్ రన్నర్స్ కు రీమేక్గా తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. సాకిని-ఢాకిని షూటింగ్ యాక్షన్ సన్నివేశాలతో మొదలు కానుందట.
కొరియన్ యాక్షన్ డైరెక్టర్ పర్యవేక్షణలో రెజీనా, నివేదా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కొరియాలో వచ్చిన మిడ్ నైట్ రన్నర్స్ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ రీమేక్లో నివేదా-రెజీనా ఎలా ఎంటర్ టైన్ చేస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!