ముంబై: అనిల్ దేశ్ముఖ్ ఓ యాక్సిడెంటల్ హోమ్ మినిస్టర్ అని మహారాష్ట్ర కూటమి ప్రభుత్వంలో భాగమైన శివసేన అనడం గమనార్హం. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన ఆర్టికల్లో కూటమి ప్రభుత్వం, గవర్నర్ను లక్ష్యంగా చేసుకొని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎంపీ, సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సంజయ్ రౌత్. ఈ మధ్య తెరపైకి వచ్చిన వివాదాలను సేన ఆధ్వర్యంలోని మహారాష్ట్ర వికాస్ అగాధి సరిగా హ్యాండిల్ చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఉద్ధవ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పైచేయి సాధించేలా చేయడంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ పాత్ర కూడా ఉన్నదని ఆయన ఆరోపించారు.
అనిల్ దేశ్ముఖ్ ఓ యాక్సిడెంటల్ హోమ్ మినిస్టర్. జయంత్ పాటిల్, దిలీప్ వాల్సే ఈ పదవి వద్దనడంతో అనిల్కు అది దక్కింది అని శివసేన ఎంపీ తన ఆర్టికల్లో రాశారు. అనిల్ రాజీనామా చేసే వాతావరణం కల్పించడంతోపాటు ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి తలెత్తిందని రౌత్ అభిప్రాయపడ్డారు. నష్టాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవని అనడం గమనార్హం. సచిన్ వాజేలాంటి ఓ జూనియర్ అధికారి పోలీసు అధికారుల నుంచి కోట్లు వసూలు చేస్తుంటే హోంమంత్రికి తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
నాపై రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారు: అనిల్ దేశ్ముఖ్
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
కోహ్లి అడిగాడు.. సాఫ్ట్ సిగ్నల్కు నో చెప్పిన బీసీసీఐ
బెంగాల్లోని ఆ 30 సీట్లలో 26 బీజేపీవే: అమిత్ షా
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి