రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాఇదని అన్నారు సుశీల సుబ్రహ్మణ్యం. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘జెమ్’. విజయ్రాజా, రాశీసింగ్, నక్షత్ర నాయకానాయికలుగా నటించారు. పత్తికొండ కుమారస్వామి నిర్మాత. ఈ నెల 17న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్లో సుశీలసుబ్రహ్మణ్యం పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ప్రేమ, యాక్షన్ అంశాలకు వాణిజ్య హంగుల్ని జోడించి తెరకెక్కించాం. ఇద్దరమ్మాయిల మధ్య మొదలైన అసూయద్వేషాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి?వారి అహంభావ మనస్తత్వం కారణంగా ఓ ప్రేమికుడు ఎన్ని కష్టాలు పడ్డాడు? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. నవ్విస్తూనే ప్రేక్షకుల్ని థ్రిల్కు గురిచేస్తుంది. తన తెలివితేటలతో ఎలాంటి సమస్యనైన పరిష్కరించే యువకుడిగా విజయ్రాజా కనిపిస్తారు. అతడి క్యారెక్టరైజేషన్ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు ‘జెమ్’ అనే టైటిల్ పెట్టాం. హీరోహీరోయిన్లతో పాటు సంపూర్ణేష్బాబు, అజయ్ పాత్రలు అలరిస్తాయి. మలీస్టారర్ కథాంశంతో తదుపరి సినిమా చేయబోతున్నా’ అని తెలిపారు.