ఒకే ఒక్క సినిమాతో రవితేజ మార్కెట్ మళ్లీ రయ్యిమంటూ పైకి లేచింది. గత ఏడాది వరకు ఈయన సినిమాలు 20కోట్ల మార్క్ అందుకోవడానికి కూడా అష్టకష్టాలు పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రూ.40 కోట్ల వరకు వచ్చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో రూ.38 కోట్ల షేర్ వసూలు చేసింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. క్రాక్ తర్వాత రవితేజ మార్కెట్ ట్రాక్ ఎక్కింది. అందుకే రాబోయే సినిమాలకు సంబంధించిన బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చింది. మే 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు దర్శక నిర్మాతలు. అయితే మరోసారి కరోనా వైరస్ ఉదృతంగా ఉండడంతో సినిమాను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే సినిమాను ఓటీటీలో విడుదల చేయమని బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది నిర్మాతలు కలలో కూడా ఊహించని ఆఫర్. రవితేజ సినిమాలు సూపర్ హిట్ అయితే 30 కోట్లు వస్తాయి. కానీ ఖిలాడి సినిమాకు ఏకంగా రూ.40 నుంచి 45 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కుల కోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రవితేజ నిర్మాతలు మాత్రం ఇంకా ఏమీ మాట్లాడడం లేదు. ఈ సినిమాకు 25 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అమెజాన్ ఏకంగా 45 కోట్ల ఆఫర్ ఇచ్చింది. మరి దీన్ని తీసుకుంటారా లేదంటే పరిస్థితులు చక్కబడే వరకు ఆగి థియేటర్ లోనే విడుదల చేస్తారా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నెటిజన్ కామెంట్..హేమ రిప్లై ఇదే..!
సురక్షితంగా ఉండండి.. సంక్షోభం నుండి బయటపడుతాం : మహేశ్బాబు
కరోనా ఎఫెక్ట్.. తండ్రికి క్షవరం చేసినబండ్ల గణేష్
కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్
ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా ..!
అంత చేసినా చివరికి యువతిని కాపాడలేకపోయానంటూ సోనూసూద్ భావోద్వేగం
కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?