రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఓ హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్ను తీసుకున్నారు. తాజాగా మరో ప్రధాన నాయిక పాత్ర కోసం మలయాళ నటి రాజీషా విజయన్ను చిత్రబృందం ఎంపిక చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు చిత్రసీమకు పరిచయం కానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో ప్రభుత్వ అధికారిగా రవితేజ పాత్ర పవర్ఫుల్గా ఉంటుంది. కథానాయికల పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో రవితేజతో పాటు దివ్యాంశ కౌశిక్, రాజీషాలపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం’ అని తెలిపారు. నాజర్, వీకే నరేష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సీఎస్, ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్.