రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దివ్యాంశకౌశిక్ కథానాయికగా నటిస్తోంది. జూలై 1 నుంచి హైదరాబాద్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకోనున్న థ్రిల్లర్ చిత్రమిది. మునుపెన్నడూ చూడనటువంటి కొత్త పాత్రలో రవితేజ కనిపిస్తారు. జూలై 1 నుంచి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి షెడ్యూల్ను మొదలుపెట్టబోతున్నాం. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం అందరూ పాల్గొంటారు’ అని తెలిపారు. 1990 బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్.