క్రాక్ సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ రవితేజ. కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లలో సినిమాను జనాలు ఆదరిస్తారా..? లేదా అనే అనుమానాలకు చెక్ పెట్టింది. రవితేజ కెర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. మాస్ మహారాజా ప్రస్తుతం రమేశ్వర్మతో ఖలాడీ సినిమా చేస్తున్నాడు. త్రినాథ రావు నక్కినతో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం చిరంజీవి నటించిన ఘరానా మొగుడు స్టైల్లో..నయా టచ్ ఇస్తూ సాగుతుందట. రవితేజలోని మాస్ యాంగిల్ను ఫర్ఫెక్ట్గా వాడుకోవాలని చూస్తున్నాడట డైరెక్టర్. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. చిరంజీవి సినిమాను స్ఫూర్తిగా తీసుకొని రవితేజ చేస్తున్న మూవీ ఉంటుందనే ఇద్దరు హీరోల అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.