ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు హామీ
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
అందోల్, మార్చి 23 : అందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం మండల కేంద్రంలో ఇరిగేషన్ కార్యాలయం కొనసాగించాలని మంగళవా రం ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అసెంబ్లీ ఆవరణలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు మంత్రి హరీశ్రావు కార్యాలయం ఇక్కడే కొనసాగించేందుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాల పునర్విభజనలో అల్లాదుర్గంలో ఇరిగేషన్శాఖ కార్యాలయం ఏర్పాటుచేశారు. కొన్ని రోజుల నుంచి కార్యాలయాన్ని తరలిస్తున్నట్లు వార్తలు రావడంతో మం డల రైతులు, ఎంపీపీ అనిల్రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, అల్లాదుర్గం సర్పంచ్ అజియాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి ఆయన ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావుకు విన్నవించారు. స్పందించిన మంత్రి రైతుల సౌల భ్యం కోసం ఇరిగేషన్ కార్యాలయం ఇక్కడే కొనసాగుతుందని హామీనిచ్చారు. నేషనల్ హైవే 161 రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండడంతో అల్లాదుర్గంలోని మండల పరిషత్, ఎం ఈవో కార్యాల యం పూర్తిగా తొలిగించారని వాటి నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరా రు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి అం దుకు సంబంధించిన నివేదికను పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ కార్యాలయం కొనసాగించేందుకు హామీనివ్వడం, భవనాల నిర్మాణం కోసం నిధులను కేటాయిస్తానని హామీనివ్వడంతో ఎమ్మెల్యేతో పాటు అల్లాదుర్గం మండల ప్రజాప్రతినిధులు, రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.