ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌజ్లో కెప్టెన్సీ టాస్క్ రచ్చ నడుస్తుంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్ అంటూ బిగ్ బాస్ నాలుగు టీంలుగా విడగొట్టగా, సంచాలకులుగా సిరి, కాజల్ ఉన్నారు. కెప్టెన్సీ టాస్క్ కూడా రచ్చగా మారింది. అయితే గ్రీన్ టీం (రవి, లోబో, శ్వేతా)సభ్యులకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించింది. దీంతో వారు అనీ మాస్టర్ టీం తయారు చేసిన బొమ్మలన్నీ తీసుకున్నారు.
అనీ మాస్టర్ తన దగ్గర బొమ్మలన్నీ పోవడంతో శ్వేత టీం దగ్గర ఉన్న బొమ్మలని దక్కించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ క్రమలో మొన్నటి వరకు తల్లి, కూతుళ్లుగా ఉన్న అనీ మాస్టర్,శ్వేత మధ్య పెద్ద గొడవ అయింది. బాగా హర్ట్ అయిన అనీ.. లాస్ట్ టాస్క్లో ఫ్రెండ్ని కోల్పోయా.. ఈ టాస్క్లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్షిప్ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. ఈ మాటలకు శ్వేత చాలా హర్ట్ అయింది.
శ్వేత అన్నం తినడం మానేయడంతో అనీ మాస్టర్ కూడా కొద్ది సేపు అలానే ఉంది. తర్వాత శ్వేత దగ్గరకు వెళ్లి ఆమెని బుజ్జగించి తిందాం రా అని చెప్పింది. ఇక టాక్ మొదలైనప్పటి నుండి చాలా కూల్గా ఉన్న రవిని చూసి సన్నీ, మానస్లు షాక్ అయ్యారు. ఆయన గేమ్ ప్లాన్పై అనుమానం వ్యక్తం చేశారు. ఇంత క్రిమినల్ మైండ్ నేనెక్కడా చూడలేదని సన్నీ అన్నాడు.
మానస్ మాట్లాడుతూ.. ‘యాంకర్ రవి ఆన్సర్ షీట్ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు.. రవికి ఆ బొమ్మలో స్లిప్ ఉందని ఎలా తెలుసు? అందుకే వాళ్లు మొదటి నుంచి చాలా కూల్గా ఉన్నారు. వాళ్లు పత్తి తీసుకుందాం బొమ్మలు కుట్టి గెలుద్దాం అని ఆడలేదు.. ఆ పవర్ ఉన్న బొమ్మ వస్తుంది.. దాన్ని గుంజుకుని.. ఎవరు ఎక్కువ బొమ్మలు చేస్తే వాళ్ల దగ్గర నుంచి తీసుకుందాం అనే ఆట ఆడారు’అన్నారు అని మానస్ చెప్పుకొచ్చాడు.