నార్నూర్, మార్చి 31: మండలంలోని గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి ఎం శ్రీనాథ్ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం వారితో సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఊరికో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డు, శ్మశాన వాటిక నిర్మిస్తున్నదని వివరించారు. అన్ని గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో రమేశ్, ఎంపీవో స్వప్నశీల పాల్గొన్నారు.