అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 20,392 మంది కోలుకున్నారు. 104 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 1,67,1742కు పెరిగాయి. 1,48,7382 మంది చికిత్సకు కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,73,622కు చేరాయి. ఇవాళ్టి వరకు మొత్తం 10,738 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ 79,564 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.