పాట్నా: ప్రైవేటు ఆసుపత్రిలో తనను లైంగికంగా వేధించినట్లు ఓ మహిళ ఆరోపించింది. బీహార్లోని భాగల్పూర్లో ఈ ఘటన జరిగింది. కరోనా సోకిన భర్తను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన భార్యను అక్కడి సిబ్బంది లైంగికంగా హింసించారు. దీంతో బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.