అమరావతి : కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేయర్, ఉప మేయర్, మున్సిపల్ చైర్పర్సర్ల ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి అధికారులకు సూచించారు. మేయర్, చైర్పర్సన్ల ఎన్నికపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ మాట్లాడుతూ.. పార్టీల విప్లకు అనుగుణంగా చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించాలని సూచించారు.
మొదటి రోజు ఎన్నిక జరగకపోతే రెండో రోజు నిర్వహించాలని చెప్పారు. ఎన్నిక ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలన్నారు.
ఎన్నికైన సభ్యులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించాలని సూచించారు. కరోనా బాధితులు వర్చువల్ ద్వారా ప్రయాణం చేసి ఓటు వేయవచ్చని తెలిపారు.
ఈ నెల 7వ తేదీన గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలతోపాటు అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కొవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. 7న మధ్యాహ్నం 3 గంటల వరకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ప్రమాణస్వీకారం ముగించాలని తెలిపింది.
3 గంటల 30 నిమిషాలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.