కన్నడ కస్తూరి రష్మిక మంధాన ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరిగా మారింది. ఛలో, గీతా గోవిందం చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా సినిమాలతో పాటు హిందీ , తమిళ సినిమాలలోను నటిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ అమితాబ్తో నటించే ఛాన్స్ అందుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా బిజీగా గడుపుతున్న రష్మిక.. కొద్ది రోజులుగా మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలతో బిజీగా ఉంది. ఈ చిత్రాల షూటింగ్ పూర్తైన తర్వాత ముంబై నుండి హైదరాబాద్కి వచ్చింది. ఇక్కడ పుష్ప సినిమాతో పాటు “ఆడాళ్లు మీకు జోహార్లు” సినిమా షూటింగ్లలో బిజీగా ఉంది.క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.
కరోనా సమయంలో తన బిజీ షెడ్యూల్ కారణంగా తన తల్లిదండ్రులు చాలా కలత చెందారని, ప్రస్తుతం పరిస్థితుల నేపధ్యంలో నా షూటింగ్లను వాయిదా వేసుకోమని కోరారంటూ చెప్పుకొచ్చింది. అయితే నాపై వారికున్న ప్రేమ ఒకింతి ఎమోషన్కి గురి చేసిందని చెప్పుకొచ్చింది. అయితే నా కోసం సినిమాలు వాయిదా వేయడం జరగదు. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్లో పాల్గొంటానని పేర్కొంది రష్మిక.