సిద్దిపేట : జిల్లాలోని ములుగు మండలం శ్రీరాంపూర్లోని సిగ్నెట్ కంపెనీలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. రూ. 5 కోట్ల విలువైన 2,384 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని సీపీ తెలిపారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల నివారణకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.