కరోనా సమయంలో పాత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నలుగురు లెజండరీ స్టార్స్ ఒకే ఫ్రేములో ఉన్న పిక్ వైరల్ అవుతుంది. 33 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెం.786 ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ వేడుక సందర్బంగా విజయ బాపినీడు మరియు చిరంజీవిలను అభినందించేందుకు గాను కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు ఆ కార్యక్రమానికి వచ్చారు.
దర్శకుడు విజయ బాపినీడు అప్పట్లో కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాడు. ఆయన కోసం అని ఈ ముగ్గురు లెజెండ్స్ పిలవగానే కాదనకుండా సక్సెస్ వేడుకకి వచ్చారట. ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, 1988 జూన్ 10న విడుదల అయిన ఖైదీ నెం.786 సినిమా లో హీరోయిన్ గా భానుప్రియ నటించగా కీలక పాత్రల్లో మోహన్ బాబు ఇంకా కోట శ్రీనివాసరావు సత్యనారాయణ నూతన్ ప్రసాద్ లు నటించారు. విజయ బాపినీడు చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఏడు సినిమాల్లో ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే.