ప్రస్తుతం టాలీవుడ్ బిజీ ఆర్టిస్టులలో రావు రమేష్ ఒకరు. . ప్రముఖ నటుడు రావు గోపాలరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టిన ఆయన తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. రావు రమేష్ సినిమా ఇప్పుడు ప్రతి తెలుగు సినిమాకి కామన్ ఆర్టిస్ట్గా మారాడు.ఆయన లేకుండా ఏ పెద్ద సినిమాలు ఉండడం లేదు.
గమ్యం, కొత్త బంగారు లోకం వంటి పలు సినిమాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రావు రమేష్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. మలయాళ సూపర్ హిట్ నాయట్టు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేష్ ప్రముఖ పాత్రలోకనిపించనున్నారట. ఈ సినిమాకు ఆయన కాల్షీట్స్ ఎక్కువ అవసరం ఉన్నందున, ఏకంగా కోటి రూపాయలు పారితోషికం అడిగాట.
చిన్న హీరోలకే కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తుండగా, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇంత పెద్ద రెమ్యునరేషన్ ఇవ్వడం గొప్ప విషయమే మరి. ప్రస్తుం రావు రమేష్ పారితోషికం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా త్వరలోనే స్క్రిప్టు పనులు పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లనుంది.