బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, కరీష్మా కపూర్ల తండ్రి రణధీర్ కపూర్ నటుడు, దర్శకుడిగా సినీ ప్రేక్షకులకు చాలా సుపరిచితం. ఈయన ఏప్రిల్ 29న కరోనాతో కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మే 2న ఐసీయూలోకి తరలించి వైద్యం అందించారు. తాజాగా ఆయన కరోనా నుండి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రికకు చెప్పారు.ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారని అన్నారు.
కరోనా నుండి కోలుకున్నా కూడా రణధీర్ కపూర్ కొద్ది రోజుల పాటు తన ఫ్యామిలీకి దూరంగా ఉండనున్నారు. కొన్ని రోజులు ఐసోలేషన్లో ఉంటే మంచిదని డాక్టర్స్ చెప్పడంతో వారి సలహా పాటిస్తున్నాను. బయటి వ్యక్తులను కూడా ఇప్పట్లో కలవను అంటూ చెప్పుకొచ్చారు. 74 ఏళ్ల నటుడు కరోనాను జయించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.