నిన్నటివరకు పిచ్చిచెట్లతో దర్శనమిచ్చే శ్మశాన వాటికలోనే అంతిమసంస్కారాలు నిర్వహించేవారు. నిధుల కేటాయింపులేక అభివృద్ధి పరిచే వారు కానరాక సమస్యల మధ్య దహన సంస్కారాలు సాగేవి. ఇలా పిచ్చిచెట్లకు నిలయమైన ప్రాంతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులను కేటాయించి, సకల సౌకర్యాలతో వైకుంఠధామంగా మార్చి పట్టణ వాసుల కష్టాలను తీర్చారు.
హుస్నాబాద్టౌన్, మార్చి 30: అంతిమసంస్కారాలు నిర్వహించే ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక హుస్నాబాద్ పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇక దూరం కానున్నాయి. వైకుంఠధామాలను అభివృద్ధి పరచడంతో ఏండ్లతరబడి నెలకొన్న సమస్యలు తొలిగిపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యే క చొరవతో నిధులను కేటాయించడంతో హుస్నాబాద్ పట్టణంలోని రెండుచోట్ల వైకుంఠధామాలను అభివృద్ధి పరిచారు.
రూ.78లక్షలతో వైకుంఠధామాలు
నిన్నటి వరకు సమస్యలకు నిలయాలుగా ఉన్న శ్మశాన వాటికలు నేడు సకల సౌకర్యాలతో దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న పలు శ్మశాన వాటికలను అభివృద్ధి పరిచేందుకుగానూ గతేడాది 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 78 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో కరీంనగర్ రహదారిలోని మినీస్టేడియం, నాగారం రహదారికి సమీపంలోని తీగలకుంట, తోళ ్లకార్ఖానా ప్రాంతాల్లో వైకుంఠధామాలను నిర్మించాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్ రోడ్లోని మినీస్టేడియం వద్ద నిర్మించే వైకుంఠధామానికి రూ. 30లక్షలు, నాగారం రహదారికి సమీపంలోని తీగలకుంట ప్రాంతాల్లో నిర్మించే వైకుంఠధామానికి రూ.23 లక్షలు, తోళ్లకార్ఖానా ప్రాంతానికి రూ. 25లక్షలు కేటాయించారు. మినీస్టేడియం పక్కన నిర్మించిన వైకుంఠధామానికి ప్రత్యేకంగా ప్రహరీని నిర్మించడంతో పాటు మంచినీటి సౌకర్యం, రెండు బర్నింగ్ బెడ్స్, స్నానపు గదులు, మరుగుదొడ్లను నిర్మించారు. తీగలకుంట ప్రాంతంలోని వైకుంఠధామంతోపాటు తోళ్లకార్ఖానా పనులను వేగవంతం చేసినట్లు మున్సిపల్ ఏఈ రంజిత్ తెలిపారు.
ఇవీ కూడా చదవండి..
ఎండలో 5 గంటలకు మించి ఉంటే సన్స్క్రీన్ లోషన్ వాడాల్సిందే..!
భారతీయుల్లో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలు