వైవిధ్యమైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులని అలరిస్తున్న దగ్గుబాటి రానా తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం రూపొందనుంది. ‘గృహం’ అనే హారర్ థ్రిల్లర్ సినిమా ఫేమ్ మిలింద్ రావు దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనుంది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీలో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని గోపీనాథ్ ఆచంట భారీ బడ్జెట్టుతో నిర్మిస్తారు.
మరి కొద్ది రోజులలో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమాని తెలుగ, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇదిక పాత్ బ్రేకింగ్ ఫిలిం అంటున్నారు.చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు మరి కొద్ది రోజులలో వెల్లడించనున్నారు.మరోవైపు రానా నటిస్తున్న విరాట పర్వం చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించగా, ప్రియమణి కీలకమైన పాత్రలో సందడి చేసింది.