దగ్గుబాటి సీనియర్ హీరో వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని దగ్గుబాటి రానా ఎప్పటి నుండో కలలు కంటున్నాడు. ఆ కల నిజమయ్యే రోజు వచ్చేసింది. రానా, వెంకటేష్ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కోసం కలిసి పని చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది.
రానా తన ట్విట్టర్ లో బాబాయితో స్క్రీన్ పంచుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఆఫ్ స్క్రీన్లో నేను ఆయన్ను ఎంత ప్రేమిస్తానో ఆన్ స్క్రీన్ లో ఒకరినొకరం తలపడతాం అంటూ రానా తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో రూపొందుతున్న ఈ వెబ్సిరీస్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నిషా కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తుంది.
కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకులు. అమెరికన్ క్రైమ్ డ్రామా రాయ్ దొనోవన్ స్ఫూర్తితో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో వెంకటేష్, రానా కనిపించి అలరించిన సంగతి తెలిసిందే.