వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ నవతరం కథానాయకుల్లో వైవిధ్యతను చాటుకుంటున్నారు హీరో రానా. తాజాగా ఆయన ఓ పాన్ ఇండియన్ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రస్తుతం పవన్కల్యాణ్తో రానా చేస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే మా చిత్రాన్ని ప్రారంభిస్తాం. పాన్ ఇండియన్ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను రూపొందించబోతున్నాం. కథ, కథనాలు సిద్ధమయ్యాయి. త్వరలో దర్శకుడు, సాంకేతిక నిపుణులతో పాటు ఇతర వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు. గతంలో ఆచంట గోపీనాథ్ టాప్హీరో, జంబలకిడిపంబ, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్తో పాటు పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు.