దగ్గుబాటి రానా గత ఏడాది ఆగస్ట్ 8న వేదమంత్రాల సాక్షిగా ప్రియురాలు మిహికా బజాజ్ని పెళ్లాడిన విషయం తెలిసిందే. కరోనా వలన పెళ్లి వేడుకను కొద్ది మంది సన్నిహితులు, బంధువులు సమక్షంలో జరిపించారు. అయితే మిహికా దగ్గర రానా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి మే 12కి సరిగ్గా ఏడాది గడిచిందట. ఈ సందర్భంగా రానా గతంలో షేర్ చేసిన పోస్టును మరోసారి అభిమానులతో పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మిహికా బజాజ్. “అతను అడిగాడు నేను ఓకే అన్నా. నా జీవితంలో తీసుకున్న అత్యుత్తుమ నిర్ణయం ఇదే.ఇది జరిగి ఏడాది అవుతుందంటే నమ్మలేకపోతున్నాను అని మిహికా పేర్కొంది.
రానా, మిహికాలు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. తాజాగా ఈ దంపతులు ఇద్దరు బంటీ బజాజ్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు. బంటీ బజాజ్ రానా అత్తగారు కాగా, గురువారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా రానా అత్తారింటికి వెళ్లారు. అల్లుడి రాకతో ఆనందించిన బంటి ఫ్యామిలీతో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ‘నా పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా చేసిన నా కుటుంబానికి కృతజ్ఞతలు’’ అని పేర్కొంది. పెళ్లి తర్వాత మిహికతో ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తూనే సినిమాల జోష్ పెంచారు దగ్గుబాటి రానా. ప్రస్తుతం ఆయన ”విరాటపర్వం, పవన్ కళ్యాణ్తో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్లో నటిస్తున్నారు.