సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. జె. భగవాన్, జె పుల్లారావు నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాలకు థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇందులో సాయితేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సోమవారం ట్విట్టర్లో సాయితేజ్ పోస్ట్ చేశారు. రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాజేష్ కథానాయికగా నటిస్తుంది.