కరోనా సెకండ్ వేవ్ మరింత విజృంభిస్తుండడంతో చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రీసెంట్గా రమ్యకృష్ణ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంది. గత నెలలో ఫస్ట్ డోస్ తీసుకున్న రమ్య తాజాగా సెకండ్ డోస్ తీసుకున్నట్టు పేర్కొంది. అలానే తన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరిని వ్యాక్సిన్ తీసుకోమని, బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పని సరిగా ధరించాలని పేర్కొంది. ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఒకప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తూనే.. దేవత క్యారెక్టర్లు చేస్తూ దండాలు పెట్టించుకుంది రమ్యకృష్ణ. ఆ తర్వాత మధ్యలో కెరీర్లో కాస్త డల్ అయిన ఈమె.. బాహుబలిలో శివగామి పాత్రతో ఇండియన్ వైడ్గా మరోసారి స్టార్ అయిపోంది. ఆ సినిమా తర్వాత ఒక్కో సినిమాకు కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రమ్యకృష్ణ.. డబుల్ పారితోషికంతో బోల్డ్ కారెక్టర్కు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.