1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగిన అందాల తార రమ్యకృష్ణ. నీలాంబరి అయిన, శివగామి అయిన, దేవత అయిన రమ్యకృష్ణ తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లోను క్షణం తీరక లేకుండా సినిమాలు చేస్తున్న రమ్య ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్గా వస్తోంది.
ఆ మధ్య జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్విన్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రంలోను కీలక పాత్ర పోషించింది రమ్యకృష్ణ. ఇందులో విశాఖ వాణి అనే పాత్రలోఆమె కనిపించనుండగా, ఈ రోజు రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా చిత్రం నుండి లుక్ విడుదల చేశారు.ఇందులో పవర్ ఫుల్ లుక్లో కనిపిస్తుంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన “రిపబ్లిక్” అక్టోబర్ 1న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు నటించారు.