టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుందట. ఇప్పటికే లాక్ డౌన్ కు ముందు దుబాయ్లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారు మహేశ్, పరశురాం టీం. దుబాయ్లో హై ఆక్టేన్ యాక్షన్ పార్టును షూట్ చేసినట్టు తెలిపారు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్.
దీని గురించి రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ..సర్కారు వారి పాటలో కొత్త టచ్ తో ఉండే ఫైట్స్ కోసం ప్రయత్నించాం. దుబాయ్ యాక్షన్ సన్నివేశాల కోసం కొత్త బృందంతో కలిసి పనిచేశాం. ఈ ఫైట్ సీన్లు చాలా బాగా వచ్చాయి. దుబాయ్ యాక్షన్ సీన్లు థియేటర్ లో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ను కలిగిస్తాయి. మహేశ్ బాబు బాడీ లాంగ్వేజీ, మ్యానిరిజం విషయంలో డైనమిక్ గా కనిపిస్తాడని చెప్పారు రామ్ లక్ష్మణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
అర్జున్ కపూర్ యోగా చేయలేనన్నాడు: మలైకా అరోరా
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!