హైదరాబాద్ : కరోనా క్రైసిస్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ నెల 22 నుంచి సినీ కార్మికులు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అపోలో ఆసుపత్రిలో టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని చిరంజీవి సూచించారు. 45 ఏండ్లు నిండిన ప్రతి సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నామని వెల్లడించారు.
వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే కార్మికులు ఆయా యూనియన్లలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
టీకా వేసుకున్న వారికి మూడు నెలలపాటు అపోలో 24/7 ద్వారా ఉచితంగా డాక్టర్లను కూడా సంప్రదించవచ్చని, మందులను కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కరోనా నుంచి తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకునేందుకు కార్మికులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని చిరంజీవి అభ్యర్థించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి