ప్రస్తుతం భాషాభేదాలకు అతీతంగా రీమేక్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రానికి రెండో భాగాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘రాక్షసుడు-2’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ గురించి కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ “రాక్షసుడు’ మించి ఆసక్తికరమైన కథ, కథనాలతో కమర్షియల్ హంగుల్ని మేళవించి రూపొందించనున్నాం. థ్రిల్లింగ్ పాయింట్తో హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. పాన్ ఇండియన్ స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో అగ్రహీరో నటిస్తారు. వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం లండన్లోనే సాగుతుంది. ఇక ‘రాక్షసుడు’ చిత్రాన్ని మా సంస్థ ద్వారా హిందీలో పునర్నిర్మించాలని అనుకున్నాం. కొవిడ్ కారణంగా కుదరలేదు. ఈ చిత్ర హిందీ రీమేక్లో అక్షయ్కుమార్ నటించనున్నారు. రమేష్వర్మ ఈ సినిమాతో బాలీవుడ్లో దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు’ అని తెలిపారు. .