చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలు. మే 13న ప్రేక్షకులముందుకురానుంది. ధర్మస్థలి నేపథ్యంలో జరిగే ఈ కథలో చిరంజీవి ఆచార్యగా, నక్సలైట్గా రెండు భిన్న పార్శాల్లో సాగే పాత్రలో కనిపించబోతున్నారు. రామ్చరణ్ సిద్ధ అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. శనివారం రామ్చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలోని ఆయన ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఆచార్యకు తోడుగా సిద్ధ చేసే పోరాటం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది.