చిక్కడపల్లి, మే 8 : పేద ప్రజలకు సీఎం స హాయనిధి ఎంతో తోడ్పాటును అందిస్తున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం గాంధీనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ సహా యం అందిస్తున్నామని తెలిపారు. కిరణ్ లాల్, రమే శ్, మహ్మద్ ఆయాజ్, అలియాజ్, అలియ భాను, యశోద, అనిత, డేవిడ్లకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జైసిం హ, నాయకులు ఆర్.వివేక్, సిరిగిరి కిరణ్, ఆర్. మో జస్, శ్యామ్ సుందర్, అస్లాం, నేతా శ్రీను, మహ్మద్ కది ర్, మల్లికార్జున్ రెడ్డి, ఎండీ మహ్మద్, ఎర్రం శేయర్, కిషన్ రావు, ముదిగొండ మురళి, ముచ్చకుర్తి ప్రభాకర్, సత్యనారాయణ, కూరగాయల శ్రీనివాస్ నా యకులు కార్యకర్తలు పాల్గొన్నారు.