హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలను ఈ నెల 9లోగా పరిషరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్.. కలెక్టర్లను ఆదేశించారు. అన్నదాతలంతా రైతుబంధు సహాయం పొందేలా చూడాలని స్పష్టంచేశారు. ధరణి పోర్టల్, సమీకృత కలెక్టరేట్ భవనాలు, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు తదితరాలపై శనివారం బీఆర్కేభవన్ నుంచి జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో సోమేశ్కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణిలో పెండింగ్ మ్యుటేషన్లు, భూములకు సంబంధించిన గ్రీవెన్స్ మాడ్యూల్, ప్రొహిబిటరీ ప్రాపర్టీలో సమర్పించిన దరఖాస్తుల పరిషార పురోగతిపై సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి స్పెషల్ ట్రిబ్యునల్లో హియరింగ్లు నిర్వహించాలని చెప్పారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణం కోసం టీఎస్ఐఐసీకి భూములు అప్పగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇటీవల ఏడు జిల్లాలకు మంజూరుచేసిన నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ అర్బన్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయింది. చిన్న చిన్న పనులు పూర్తిచేసి ఈ 12 సమీకృత భవనాలను వారంలోగా ప్రారంభించడానికి సిద్ధంచేయాలని సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు.