ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,659 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మార్చి 10 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో కరోనా వల్ల 300 మంది ప్రాణాలు కోల్పోగా, 21,776 మంది డిశ్చార్జ్ అయ్యారు. ముంబై నగరంలో 24 గంటల్లో 866 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 95.01%గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 16.04గా ఉంది. వరుసగా ఆరో రోజూ, శనివారం రాష్ట్రంలో 20వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,88,027 యాక్టివ్ కేసులున్నాయి.