ఈ ఏడాది ‘రెడ్’ సినిమా విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు హీరో రామ్. తాజాగా ఆయన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని రామ్ గురువారం ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘ఫైనల్ నరేషన్ పూర్తయింది. లవ్ యూ లింగుస్వామి సర్…ఇక కెమెరాను స్టార్ చేయండి’ అంటూ రామ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటించనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని, సామాజిక సందేశం కలబోసిన చిత్రమిదని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.